సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది రెచ్చగొట్టాలని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తుంటారు. అయితే ఆ కామెంట్లను కొంతమంది పట్టించుకుంటే మరికొందరు సెలబ్రెటీలు చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ కొంతమంది సెలబ్రెటీలు మాత్రం చెంపచెల్లుమనిపించేలా రిప్లై లు ఇస్తుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కు కూడా సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.
Advertisement
నేడు మద్యాహ్నం అమితాబ్ బచ్చన్ పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో గుడ్ మార్నింగ్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సమయంలో గుడ్ మార్నింగ్ ఏంటి అంటూ కొంతమంది కామెంట్లతో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ కామెంట్స్ లో ఓ నెటిజన్ ఇది మద్యాహ్నం ముసలోడా అంటూ కామెంట్ చేశాడు.
Advertisement
ఇక తనపై వస్తున్న కామెంట్లకు అప్పటికే అమితాబ్ సహనంతో సమాధానాలు ఇస్తున్నారు. అలాంటి సమయంలో ముసలోడా అంటూ కామెంట్ చేయడంతో అమితాబ్ రిప్లై ఇచ్చాడు. మీరు ఎక్కువకాలం జీవించాలని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఎవరూ ముసలోడా అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నాను..అంటూ చాలా ఓపికగా సమాధానం ఇస్తూనే వాడికి బుద్ది వచ్చేలా కామెంట్ చేశాడు.
ALSO READ :
ఒకే ఫ్రేమ్లో అక్కినేని కుటుంబం.. అక్కడ ఎవ్వరు మిస్ అయ్యారంటే..?