యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా రీసెంట్ గా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. అక్కడ స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం లేదని అన్నారు.
ఈ పరిస్థితి మారాలని అన్నారు. ఈ పరిస్థితుకు కారణం ఇండియన్ ఇండస్ట్రీ మరడమే అంటూ అరవింద్ కామెంట్లు చేశారు. ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్లి సరదాగా గడిపేవారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. ఓటీటీ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్ కు రప్పిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
ఈ డేంజరెస్ ట్రెండ్ నుండి మనం బయటపడాల్సిన అవసరం ఉందంటూ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. మన తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవాలంటే స్టార్ హీరోలు అందరూ ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని తెలిపారు. ఇక ఇలాంటి సమయంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించిందని కొనియాడారు. విశ్వక్ సేన నటన చూసి ఆశ్చర్యపోయానని ప్రశంసలు కురిపించారు.
ALSO READ :
“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే…!