అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా సినిమా నటులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు కానీ బుల్లితెర నటీనటులకు, సోషల్ మీడియా సెలబ్రెటీలకు ఎంతో ప్లస్ అయ్యిందనే చెప్పాలి. బిగ్ బాస్ తరవాత ఎంతోమంది బుల్లితెర స్టార్ లకు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తరవాత తాను ఇబ్బందులు పడినట్టు నటుడు అలీ రైజా వెల్లడించారు. అలీ రైజా బిగ్ బాస్ సీజన్ 3 లో సందడి చేశాడు.
Advertisement
ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా అలీతో సరదాగా అనే టీవీ షోకు అలి రైజా మరియు నటుడు అమిత్ తివారీ అతిధులుగా వచ్చారు. ఈ సంధర్బంగా అలి రైజా ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. అలి రైజా బిగ్ బాస్ కు వెళ్లకముందే రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కానీ బిగ్ బాస్ లోకి ఎంట్రి ఇచ్చి బయటకు వచ్చిన తరవాత నాగ్ హీరోగా నటించిన వైల్డ్ డాగ్ తప్ప మరే సినిమాలో కూడా నటించలేదు.
Advertisement
అయితే తాను సినిమాల్లోకి నటించకపోవడానికి కారణం తనపై తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ బ్యాన్ విధించడమే అని చెప్పాడు. బిగ్ బాస్ నుండి వచ్చిన తరవాత తనకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి ఫోన్ వచ్చిందని ఆఫీస్ కు వెళితే..రెండేళ్లు తనపై బ్యాన్ విధించారని చెప్పారని తెలిపాడు. దాంతో తాను షాక్ అయ్యానని అన్నాడు. అయితే తనపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ బ్యాన్ ఎందుకు విధించిందో చెప్పలేదు.
ALSO READ : ఛత్రపతి శంకర్ కు రాజమౌళి పిలిచి మరీ అకాశాలు.. కారణం ఏంటి…!
కానీ టాలీవుడ్ టాక్ ప్రకారం..అలీ రైజా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. కానీ మధ్యలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది. దాంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో సినిమా నిర్మాతలు అలీపై ఫిర్యాదు చేశారట. దాంతో అలీ రైజా రెండేళ్ల పాటు సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చిందట. ఇదిలా ఉండగా అసలు అలీ రైజా ఏం చెబుతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.