Home » ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ చైర్మెన్ గా అలీ…?

ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ చైర్మెన్ గా అలీ…?

by AJAY
Ad

టాలీవుడ్ కమెడియన్ అలీకి సీఎం జగన్ కీలక పదవి అప్పగించినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ వ‌క్ఫ్ బోర్డు చైర్మన్ గా అలీని నియ‌మించిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా అలీ మొదటి నుండి వైసిపిలో యాక్టివ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున అలీ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వైసిపి రాజకీయ కార్యక్రమాల్లో అలీ కనిపిస్తుంటారు.

Advertisement

Advertisement

రీసెంట్ గా సినీ ప్రముఖులతో పాటు అలీ కూడా సీఎం జగన్ ను కలుసుకున్నారు. దాంతో సీఎం జగన్ మరోసారి అలీని పిలిచారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా అలీని రాజ్యసభకు పంపించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అలీ మాత్రం తనకు పదవులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించాలని పార్టీ భావించినప్పటికీ తాను అంగీకరించలేదని చెప్పారు.

Ali cm jagan

త‌న‌ను ఎలా వినియోగించుకుంటారని పార్టీ కార్యాలయం నుండి గాని ముఖ్యమంత్రి నుండి కానీ ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ నేపథ్యంలో లో పీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సీఎం జగన్ అలీని ఎంపిక చేసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడాల్సి ఉంది.

Visitors Are Also Reading