Home » IND Vs SL : శ్రీలంకతో సెకండ్ టెస్ట్.. కుల్దీప్ స్థానంలో అక్షర్ పటేల్ కు చోటు

IND Vs SL : శ్రీలంకతో సెకండ్ టెస్ట్.. కుల్దీప్ స్థానంలో అక్షర్ పటేల్ కు చోటు

by Anji
Published: Last Updated on
Ad

శ్రీలంకతో జరిగే రెండవ టెస్టులో భారత జట్టు స్వల్ప మార్పులు చేసింది. బెంగళూరు వేదికగా పింక్ బాల్ టెస్ట్ కు లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను జట్టులో తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గాయం కారణంగా అక్షర్ పటేల్ దక్షిణాఫ్రికా పర్యటనకు, వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ కు దూర‌మైన‌ విషయం తెలిసినదే.

Advertisement

ప్రస్తుతం అతడు కోలుకున్నాడు. శ్రీలంక టెస్ట్ మ్యాచ్ తొలుత అక్షర ప‌టేల్‌నే ఎంపిక చేద్దామని అనుకున్నాం. ప్రకటించే నాటికి అతడు పూర్తిగా కోలుకోలేదు. బ్యాకప్ ప్లేయర్ గా కుల్దీప్ యాదవ్ ను అతని స్థానంలో ఎంపిక చేశాం. అక్షర్ కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించాడు.

Advertisement

కుల్దీప్ పక్కన పెట్టామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కుల్దీప్ 2021 ఫిబ్రవరిలో మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉండగా.. శ్రీలంకతో టెస్టు సిరీస్ జట్టు ను సమయంలోనే.. రెండ‌వ టెస్ట్ మ్యాచ్‌కు అక్ష‌ర్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని జ‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. బెంగ‌ళూరు వేదిక‌గా మార్చి 12 -16 వ‌ర‌కు భార‌త్‌- శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది.

Also Read :  Governor Tamilisai : దేనికి భ‌య‌ప‌డ‌ను.. న‌న్ను ఎవ‌రూ భ‌య‌పెట్ట‌లేరు..!

Visitors Are Also Reading