Home » పెరిగిన ఆదిపురుష్ బడ్జెట్.. ఎందుకంటే..?

పెరిగిన ఆదిపురుష్ బడ్జెట్.. ఎందుకంటే..?

by Azhar
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో వేగంగా షూటింగ్ అనేది జరుపుకుంటున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా అనేది నేరుగా హిందీలోనే తెరకెక్కుతుంది. తెలుగుతో సహా మిగిలిన అన్ని భాషలో ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయనున్నారు. అయితే ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్ కనిపిస్తుంది.

Advertisement

అయితే ఈ సినిమాను ప్రకటించిన సమయంలోనే దీనిని 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇందులో సగం రెమ్యునరేషన్స్ కే పోతున్నాయి అనేది తెలిసిందే. ఎందుకంటే అందులో ప్రభాస్ ఒక్కడే 120 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఇక రావణాసురునిగా కనిపించే సైఫ్ ఆలీఖాన్ అలాగే హీరోయిన్ కు ఇలా అందరి రెమ్యునరేషన్స్ అనేవి కలిస్తే సగం వెళ్ళిపోతుంది. ఇక ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల చేయాలనుకున్నారు.

Advertisement

కానీ కరోనా కారణంగా షూటింగ్ అనేది ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా సినిమాను ఆరు నెలలు వెన్నకి తీసుకెళ్లడం వల్ల సినిమా బడ్జెట్ అనేది భారీగా పెరిగింది. ముందుగా అనుకున్న 500 కోట్ల కంటే ఇప్పుడు అదనంగా మరో 125 కోట్లు అనేది ఈ సినిమా బడ్జెట్ లో నిర్మాతలు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే సినిమా విడుదల తర్వాత ఇదంతా వెన్నకి వస్తుందా లేదా చూడాలి.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఆజాం రికార్డుకు ఎసరు పెట్టిన సూర్య..!

మళ్ళీ పాకిస్థాన్ వెళ్తాను అంటున్న ఇంగ్లాండ్..!

Visitors Are Also Reading