Home » జీవితంలో సౌంద‌ర్య చేసిన అతిపెద్ద త‌ప్పు ఏంటోతెలుసా.? త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌న్నా విన‌కుండా..!

జీవితంలో సౌంద‌ర్య చేసిన అతిపెద్ద త‌ప్పు ఏంటోతెలుసా.? త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌న్నా విన‌కుండా..!

by AJAY
Ad

చిత్ర పరిశ్రమలో సావిత్రి తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. ప్రస్తుతం సౌందర్య మన మధ్యన లేకపోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా నటించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన సౌందర్య అన్ని భాషీయుల‌ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.

heroine-soundarya

Advertisement

టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలో రాణించారు. ఇక‌ కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే సౌందర్య బిజెపి పార్టీలో చేరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె మరణ వార్త టాలీవుడ్ ను ఒక్కసారిగా కుదిపేసింది. ఇక ఇప్పటికీ సౌందర్య ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాల్లోకి వస్తున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.

Advertisement

soundarya

soundarya

ఇదిలా ఉండగా సౌందర్య తన జీవితంలో తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక పని చేసింది. అదే సౌందర్య తన బంధువుల అబ్బాయి అయిన ర‌ఘును వివాహం చేసుకోవడం. నిజానికి రఘును పెళ్లి చేసుకోవడం సౌందర్య తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదట. కానీ సౌందర్యనే వారిని ఒప్పించి మరీ రఘును వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.

సౌందర్యతో పెళ్లి తర్వాత రఘు చేసిన కొన్ని పనులు కూడా ఆమె తల్లిదండ్రులకు కోపం తెప్పించాయ‌ట‌. అదే విధంగా సౌందర్య మరణం అనంతరం కూడా రఘు ఆమె కష్టపడి సినిమాల్లో సంపాదించిన డబ్బును అనుభవిస్తున్నాడని సౌందర్య త‌ల్లి దండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు సౌంద‌ర్య రాజ‌కీయాల్లోకి రావ‌డం కూడా అమె అభిమానుల‌కు ఇష్టం లేదు. కానీ జీవితంలో ఏం జ‌రగాలో అది జ‌రిగిపోతుంది కాబ‌ట్టి కాలంతో ప్ర‌యాణించ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేం.

ALSO READ : చిరంజీవి ఆ రోజు ఆ ఒక్క తప్పు చేసుంటే ఈ రోజు అల్లు ఫ్యామిలీకి ఆలుడుగా వెల్లవారు కాదట ! ఇంతకీ ఏమిటది ?

Visitors Are Also Reading