Home » సీరియ‌ల్ పూర్త‌యినా రూ.70ల‌క్ష‌లు ఇవ్వ‌లేదు…సీరియల్ న‌టి ఆవేద‌న‌..!

సీరియ‌ల్ పూర్త‌యినా రూ.70ల‌క్ష‌లు ఇవ్వ‌లేదు…సీరియల్ న‌టి ఆవేద‌న‌..!

by AJAY
Ad

క‌రోనా కార‌ణంగా అన్ని రంగాల్లో వారు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కున్నారు. అందులో టెలివిజ‌న్ రంగంలో ప‌నిచేస్తున్న‌వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ సీరియ‌ల్ న‌టి సీరియ‌ల్ పూర్త‌యి మూడేళ్లు గ‌డుస్తున్నా కూడా త‌న‌కు రావాల్సిన రూ.70ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ను ఇవ్వ‌లేదంటూ ఆరోప‌ణ‌లు చేసింది. హిందీలో ద‌స్తాన్ ఈ మ‌హ‌బ్బ‌త్ స‌లీం అనార్క‌లీ అనే సీరియ‌ల్ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. ఈ సీరియ‌ల్ దాదాపు ఏడాది కాలం పాటూ ప్ర‌సారం అయ్యింది.

Advertisement

Advertisement

ఇక ఈ సీరియ‌ల్ ఓ న‌టించిన న‌టి సోనారికా బ‌డోరియా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు చెప్పింది. ఈ సీరియల్ పూర్త‌యి మూడేళ్లు గ‌డుస్తున్నా కూడా త‌న‌కు ఇంకా రావాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని ఆవేదన వ్యక్తం చేసింది. త‌నతో పాటూ ఇత‌ర న‌టీన‌టులకు మ‌రియు టెక్నీషియ‌న్స్ కు కూడా పేమెంట్లు ఇవ్వ‌లేద‌ని ఆవేదన వ్య‌క్తం చేసింది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌ర‌వాత ఇబ్బందులు ఎదురుకున్నామ‌ని…ఆ త‌ర‌వాత పేమెంట్లు రాకపోవ‌డంతో ఇప్ప‌టికీ ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని సోనారికా వెల్ల‌డించింది. దీనిపై తాను చ‌ట్ట‌ప‌రంగా కూడా ముందుకు వెళ‌తాన‌ని వీళైనంత త్వ‌ర‌గా త‌న‌కు రావాల్సిన డ‌బ్బులు కావాల‌ని సోనారిక ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Visitors Are Also Reading