టాలీవుడ్ లో అందం అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో స్నేహ కూడా ఒకరు. హీరోయిన్ స్నేహ అనిల్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఇంగనే ఒరు నీలపక్షి అనే మలయాళ సినిమాతో 2000 సంవత్సరంలో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరవాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ఫుల్ బిజీ అయ్యారు. స్నేహ తెలుగులో ప్రియమైన నీకు అనే సినిమాతో హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.
Advertisement
చూడ్డానికి అచ్చం తెలుగమ్మాయిలా ఉండటం…కట్టు బొట్టు కూడా తెలుగమ్మాయిలాగే ఉండటంతో తెలుగు ప్రేక్షకులు స్నేహకు ఫిదా అయ్యారు. ఇక ప్రియమైన నీకు సినిమా తరవాత రవితేజ హీరోగా నటించిన వెంకీ అనే సినిమాలో స్నేహ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా నాగార్జున ముఖ్యమైన పాత్రలో నటించిన ఆధ్యాత్మిక చిత్రం శ్రీరామదాసు సినిమాలో నటించి స్నేహ తన నటనతో ఆకట్టుకున్నారు.
Advertisement
ఇదిలా ఉండగా స్నేహా ప్రసన్న అనే హీరోతో ప్రేమలో పడ్డారు. తాను హీరోయిన్ గా నటించిన అచ్చముందు అనే సినిమాలో ప్రసన్న హీరోగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ఇక పెళ్లి తరవాత స్నేహ 2015లో అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్రకు భార్యగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఆ తరవాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయవిదేయరామ తో పాటూ మరికొన్ని సినిమాల్లో నటించారు.
ఇదిలా ఉంటే స్నేహా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌందర్య చనిపోవడం మీకు కలిసి వచ్చిందా.?? అని యాంకర్ అడగ్గా…ఆ విషయంతో తాను ఏకీభవించనని స్నేహ కొట్టిపారేశారు. తాను సౌందర్యకు పెద్ద అభిమాని అని ఆమె మరణవార్తను విని తట్టుకోలేకపోయానని చెప్పారు. చిత్రపరిశ్రమలో ఎవరిస్థానం వారిదని సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా ఎప్పుడూ మన మధ్యే ఉంటుందని చెప్పారు.
Also read :
“ఆచార్య” సినిమాలో నటించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా…..? ఆమె ఎవరంటే..!