Home » ఎన్టీఆర్ చనిపోయినప్పుడు లక్ష్మీ పార్వతి దర్జాగా కూర్చుని అలా చేశారు…వైరల్ అవుతున్న నటి కామెంట్స్…!

ఎన్టీఆర్ చనిపోయినప్పుడు లక్ష్మీ పార్వతి దర్జాగా కూర్చుని అలా చేశారు…వైరల్ అవుతున్న నటి కామెంట్స్…!

by AJAY

ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు సెకండ్ హీరోయిన్ గా నటించిన ఒకప్పటి హీరోయిన్ పూజిత గుర్తుందా. ఇలా చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూ లతో పూజిత చాలా ఫేమస్ అయ్యింది. కాబట్టి ఆమె ముఖం చూస్తే టక్కున ఈవిడా అని గుర్తుపట్టేస్తారు. ఇక ఇద్దరు భార్యల ముద్దుల పోలీస్ సినిమా తర్వాత పూజిత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది.

దాంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనుకున్న మేర పూజిత కు గుర్తింపు రాలేదు. దాంతో మెల్లిమెల్లిగా పూజిత వెండితెరకు దూరమయ్యారు. ఇక అప్పట్లో తన భర్త మోసం చేశాడంటూ పూజిత అతడిపై కేసు పెట్టి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. అంతేకాకుండా మరో ఐఏఎస్ అధికారిని కూడా పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆరోపణలు చేశారు.

ntr laxmi parvathi

ఇది ఇలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో పూజిత ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి పై సంచలన ఆరోపణలు చేశారు. దాంతో ప్రస్తుతం పూజిత చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మరణించిన సమయంలో తాను చూసేందుకు వెళ్లానని చెప్పారు. అయితే అప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఒకదగ్గర దర్జాగా కూర్చుని టీ తాగుతున్నారని చెప్పారు. అయితే అదే సమయంలో అక్కడకు నరసింహారావు గారు రావడంతో లక్ష్మీపార్వతి పడి పడి ఏడ్చేసారని ఆరోపించారు. అది చూసిన తర్వాత అలా ఎలా చేస్తారు…? అని తనకు అనిపించిందని అన్నారు.

అంతేకాకుండా ఒక పొలిటికల్ డ్రామా లో తనను లక్ష్మీ పార్వతి పాత్రలో నటించాలని కోరారని తెలిపారు. దాంతో ఆ సినిమాలో లక్ష్మీపార్వతిని అనుకరించానని అన్నారు. ఆ సినిమా వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి తనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కానీ తాను భయపడలేదని…. ఆ సినిమా దర్శకుడు నిర్మాత చూసుకున్నారని అన్నారు. తాను ఒక ఆర్టిస్టు అని డబ్బులు ఇస్తే ఏ పాత్రలో అయినా నటిస్తానని పూజిత వెల్లడించారు.

Visitors Are Also Reading