సీనియర్ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి నీలవేణి (85) అనారోగ్యంతో ఇవాళ మృతి చెందింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమెఎ హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపతిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె పరమపదించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న నటి జయప్రద తల్లి మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్కు బయలుదేరారు.
ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అందం, అభినయంతో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా తిప్పిన జయప్రద భూమికోసం చిత్రంతో తెలుగు తెరపై మెరిసారు. తన సినీ కెరీర్ లో జయప్రద మొత్తం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠి 300 లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రస్తుతం జయప్రద భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు.
AlsoRead : ఆ సీన్లు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా…టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్…!