పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో రానా కూడా కీలక పాత్రలో నటించారు. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది.
Advertisement
ఈ సినిమాలో రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా పవన్ కల్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా సూపర్ హిట్ టాక్ వచ్చిన ఈ సినిమాను కొంతమంది నటీనటులు మిస్ చేసుకున్నారు. అలా ఈ సినిమాను రిజెక్ట్ చేసిన నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించగా ఆయనకు హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ సాయి పల్లవి ఈ సినిమాకు నో చెప్పింది. దాంతో ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటించే అవకాశం నిత్యామీనన్ కు వచ్చింది.
Advertisement
సినిమాలో రానా కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే రానాకు జోడీగా సినిమాలో మొదట ఐశ్వర్య రాజేష్ ను అనుకున్నారు. అంతే కాకుండా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఐశ్వర్య రాజేష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. మరోవైపు ఈ సినిమాలో మొదట హీరోగా మేకర్స్ ఓ ముగ్గురు హీరోలను అనుకున్నారు. మొదటగా బాలకృష్ణ వద్దకు ఈ సినిమా వెల్లగా ఆయన రిజెక్ట్ చేశారట.
ఆ తరవాత వెంకటేష్ కూడా ఈ సినిమాకు నో చెప్పారు. రవితేజ వద్దకు కూడా ఈ కథ వెల్లగా ఆయన కూడా నో చెప్పారు. అయితే త్రివిక్రమ్ ప్రోత్సాహంతో పవన్ కల్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా భీమ్లా నాయక్ బొమ్మ తెరపైకి వచ్చింది.