చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. డ్యాన్స్…యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ చాలా సినిమాలు చేసినప్పటికీ చరణ్ కు నటన రాదని కామెంట్లు వినిపించేవి. కానీ రంగస్థలం సినిమాతో చరణ్ కు నటన రాదు అనే వాళ్ల నోర్లను మూయించాడు. ఇక ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సమంత హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా నటించాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. రంగస్థలం సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్, జగపతి బాబు లు కనిపించారు. ఇక ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. కానీ పృథ్వీరాజ్ మాత్రం కనిపించరు.
Advertisement
అయితే వారం రోజులు తాను షూటింగ్ లో పాల్గొన్నానని సినిమాలో తనది ముఖ్యమైన పాత్ర అని పృథ్వీరాజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకున్నానని తెలిపారు. కానీ తన పాత్రను సినిమాలో మాత్రం కత్తిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి కారణం సుకుమార్ స్నేహితుడు అని చెప్పారు.
అమెరికాలో ఉంటున్న సుకుమార్ స్నేహితుడు ఒకరు ఈయనను సినిమాలో ఎందుకు పెట్టుకున్నారు అని ఫోన్ చేసి అన్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఈయన సినిమాలో ఉంటే రావుగోపాల్ రావులా అవుతారని చెప్పారట. అందువల్లే తన సీన్లను కత్తిరించారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also read: బాబు మోహన్ ఉంటే ఆ సినిమాలో నటించమని చెప్పిన కోటా, బ్రహ్మానందం..!అలా ఎందుకన్నారు.?