టాలీవుడ్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి పై హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నరేష్ పేరు చెప్పి రమ్య డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం పై నటుడు నరేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. రమ్య జరుపుతున్న ఆర్థిక వ్యాపార లావాదేవిలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఆమెతో మనస్పర్థలు రావడంతో ఐదేళ్లుగా దూరంగా ఉంటున్నానని చెప్పారు. అంతే కాకుండా తనతో వివాహం తరవాత కూడా రమ్య అలాంటి వ్యవహారాల్లో ఉండటం వల్లే తాను ఆమెకు దూరమయ్యానని చెప్పాడు.
Advertisement
ఇలాంటి ఘటనలు తనను మనోవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. మోసం చేసిన వారికి తిరిగి సొమ్ము ఇచ్చేందుకు సర్దుబాటు చేసే ఆలోచనలో రమ్య ఉన్నట్టు తెలుస్తోందని చెప్పారు. రమ్య గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయని దాంతో చాలా మంది తనకు ఫోన్ చేసి అడుగుతున్నారని నరేష్ చెప్పుకొచ్చారు. బంధు మిత్రులు స్నేహితుల వల్ల తనకు తెలిసిందన్నారు.
Advertisement
తమకు పెళ్లై 9 ఏళ్లు అయిందని…ఐదేళ్లుగా దూరంగా ఉన్నామని చెప్పారు. గతంలో హిందూ పూర్ వివాదం సహా మరికొన్ని వచ్చాయని ఆ తరవాత ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ పబ్లిక్ నోటీసు కూడా ఇచ్చామని చెప్పారు. అంతే కాకుండా గత కొద్ది రోజులుగా కొంతమంది ఆమె ఇంటికి రావడం..కార్లు రావడం కొంతమంది రాత్రులు రావడం కూడా జరుగుతుందని చెప్పారు.
బిడ్డ ఉన్నాడని ఎలాంటి తప్పులు చేయవద్దని తాను వేడుకున్నానని తెలిపారు. తాము మోసపోయామంటూ ఫోన్ చేస్తున్నారని వారికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. తమ కుటుంబాకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదని…ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.