Home » కోట్ల రూపాయలు సంపాదించి 5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ విలన్ చివరికి తినడానికి కూడా తిండి లేని స్థితిలో చనిపోయాడా ?

కోట్ల రూపాయలు సంపాదించి 5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ విలన్ చివరికి తినడానికి కూడా తిండి లేని స్థితిలో చనిపోయాడా ?

by AJAY
Ad

సినిమాలో హీరో పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా ఉండాలంటే విల‌న్ కూడా అందుకు ధీటుగానే ఉండాలి. కాబ‌ట్టి సినిమాల‌లో హీరో త‌ర‌వాత మ‌ళ్లీ విల‌న్ కు అంత క్రేజ్ ఉంటుంది. అందుకే మంచి విల‌న్ పాత్ర వ‌స్తే హీరోలు కూడా న‌టించడానికి రెడీ అవుతుంటారు. ఇక టాలీవుడ్ లోని ఒక‌ప్ప‌టి విలన్స్ లో మ‌హేశ్ ఆనంద్ కూడా ఒక‌రు. లంకేశ్వ‌రుడు సినిమాతో మ‌హేశ్ ఆనంద్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర‌వాత అల్లుడా మ‌జాకా సినిమా విల‌న్ గా న‌టించి అద‌ర‌గొట్టాడు.

Advertisement

ఘ‌రానా మొగుడు సినిమాతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లో ఎంతో స‌క్సెస్ అయిన మ‌హేశ్ ఆనంద్ జీవితంలో మాత్రం ఎంతో విషాదం ఉంది. మ‌హేశ్ ఆనంద్ ముంబైలో జ‌న్మించాడు. చిన్న‌తనంలో కరాటే నేర్చుకున్నాడు. ఆ త‌ర‌వాత సొంతంగా మార్ష‌ల్ ఆర్ట్స్ స్కూల్ ను న‌డిపించాడు. మ‌హేశ్ ఆనంద్ కు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ స్కూల్ కూడా స్థాపించాడు.

Advertisement

టీనేజ్ నుండే ఎంతో క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు సంపాదించుకున్నాడు. ఓ నిర్మాత మ‌హేశ్ ఆనంద్ మార్ష‌ల్ ఆర్ట్స్ స్కూల్ లో త‌నకుమారుడిని చేర్చించ‌డానికి వెళ్లిన‌ప్పుడు అత‌డిని చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. ఆ నిర్మాత తెలిసిన ద‌ర్శ‌కుల‌కు మ‌హేశ్ ఫోటోల‌ను పంపించగా సినిమాలో ఆఫ‌ర్ అందుకున్నాడు. అలా బాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేశాడు. అమితాబ్ సినిమాలో మ‌హేశ్ ను చూసి దాస‌రి చిరంజీవి లంకేశ్వ‌రుడు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

అలా టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్ర‌ముఖ విల‌న్ గా ఎదిగాడు. ఇక సినిమాల్లో రానిస్తున్న స‌మ‌యంలోనే న‌టి రీనారాయ్ సోద‌రి బ‌ర్కారాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల‌కే వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర‌వాత ఒక‌రి త‌ర‌వాత ఒక‌రు ఇలా మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఐదో భార్య ఉష‌తో ఎక్కువ కాలం ఉన్నాడు. మ‌హేశ్ ఆనంద్ తాగుడుకు బానిస అవ్వ‌డంతో బాలీవుడ్ అత‌డిని బ్యాన్ చేసింది. ఆ త‌ర‌వాత ఐదో భార్య కూడా మ‌హేశ్ ను విడిచి వెళ్లిపోయింది. ఆ త‌ర‌వాత మహేశ్ డిప్రెష‌న్ లోకి వెళ్లి పూర్తిగా మ‌త్తుపదార్థాల‌కు అల‌వాటుప‌డ్డాడు. 2018లో త‌న ఫ్లాట్ లో దిక్కులేని స్థితిలో మ‌ర‌నించాడు. చ‌నిపోయిన మూడు రోజుల త‌ర‌వాత ప‌నిమ‌నిషి ద్వారా పోలీసుల‌కు ఆ విష‌యం తెలిసింది.

Visitors Are Also Reading