Home » తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిసి నటుడు ఆలీ .. ఎందుకో తెలుసా ?

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిసి నటుడు ఆలీ .. ఎందుకో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సినీ నటుడు ఆలీ అకస్మాత్తుగా  హైదరాబాద్‌ లోని రాజభవన్‌లో కనిపించారు. అదేంటి ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కదా పదవీ ఇచ్చింది.  తెలంగాణ రాజ్‌భవన్‌లో ఏం పని అని చాలా మంది అనుకోవచ్చు. ఏం లేదండి.. ఆలీ రాజ్‌భవన్‌కి వచ్చి గవర్నర్  తమిళిసై సౌందర్‌రాజన్‌ ని కలవడానికి గల కారణాలను చెప్పారు. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి నిశ్చయమైంది. త్వరలోనే ఆ వివాహం జరగనుంది. ఆ పెళ్లికి ఆహ్వానించి వివాహ పత్రిక ఇవ్వ నికి ఆలీ రాజన్‌భవన్‌కి వచ్చారు.

Advertisement

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ తెలంగాణ గవర్నర్  తమిళి సై సౌందర్ రాజన్ ని కలిసి పెళ్లి వేడుకకు హాజరు కావాలని కోరారు. తొలుత గౌరవప్రదంగా కలిసి ముచ్చటించారు. ఆ తరువాత పెళ్లి పత్రిక స్వీకరించిన తమిళి సై కూడా తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read :  విలన్ దేవరాజ్ రాజ్ భార్య ఆ అందమైన హీరోయిన్ అన్న సంగతి తెలుసా…?

అక్టోబర్ 25న తేదీన అలీ పెద్ద కూతురు ఫాతిమా  ఎంగేజ్ మెంట్  హైదరాబాద్  లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు.పెళ్లి పనులు సాంప్రదాయ పద్ధతిలో ఇరుకుటుంబాల సభ్యుల సమక్షంలో దగ్గర ఉండి  నిర్వ హిస్తున్నారు.  ఓవైపు సినీ నటుడుగా, మరోవైపు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు ఆలీ. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహా దారుడు పదవీ అప్పగించడంతో అలీ ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇక పెళ్లి వేడుకకు సినీ రంగ ప్రముఖుల, రాజకీయ రంగ ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

Also Read :  వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్ పై తప్పుడు ప్రచారం..!

Visitors Are Also Reading