Home » మా అబ్బాయి, కోడ‌లు నాలుగేళ్లుగా మాట్లాడ‌టం లేదు..న‌టి శ్రీసుధ ఎమోష‌న‌ల్..!

మా అబ్బాయి, కోడ‌లు నాలుగేళ్లుగా మాట్లాడ‌టం లేదు..న‌టి శ్రీసుధ ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న న‌టి శ్రీసుధ‌. వంద‌ల సినిమాల్లో శ్రీసుధ అక్క‌, త‌ల్లి లాంటి పాత్ర‌లు చేసి అభిమానుల‌ను సంపాదించుకుంది. అమాయ‌కపు త‌ల్లి పాత్ర‌ల‌లో శ్రీసుధ న‌టించి నిజంగా బ‌య‌ట స‌మాజంలో త‌ల్లి ఇలానే ఉంటుంది అన్నంత స‌హ‌జంగా క‌నిపించింది. ఇప్ప‌టికీ సినిమాలో త‌ల్లి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటే ఆ సినిమాలో శ్రీసుధ‌నే న‌టిస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీసుధ మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ కామెంట్ లు చేసింది. త‌న‌కు కూతురు కుమారుడు ఉన్నార‌ని శ్రీసుధ చెప్పింది. త‌న కుమారుడు ఫారెన్ లో స్థిర‌ప‌డ్డాడ‌ని ఫారెన్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడ‌ని శ్రీసుధ చెప్పారు. ఆ పెళ్లి త‌న‌కు ఇష్టం లేక‌పోయినా ఒప్పుకోక త‌ప్ప‌లేద‌ని అన్నారు. అంతే కాకుండా కోడలు కొడుకు త‌న‌తో నాలుగేళ్లుగా మాట్లాడ‌టం లేద‌ని చెప్పారు.

Advertisement

తాను ఫోన్ చేసినా కూడా వారు లిఫ్ట్ చేయ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాళ్లు అలా చేశార‌ని తానేమీ తిట్టుకోవ‌డం లేద‌ని….ఏదో ఒక‌రోజు వాళ్లే తెలుసుకుంటార‌ని చెప్పారు. ఎక్క‌డున్నా వాళ్లు సుఖంగా ఉంటే త‌న‌కు అదే చాల‌ని శ్రీసుధ వ్యాఖ్యానించారు.అంతే కాకుండా వాళ్లు ఎక్క‌డ ఉన్నా హ్యాపీగా ఉంటే తాను హ్యాపీగా ఉంటాన‌ని వాళ్లు బాధ‌ప‌డితే తాను కూడా బాధ‌ప‌డతాన‌ని అన్నారు. జీవితంలో ఎదురైన అనుభ‌వాలే త‌న‌ను ఇక్క‌డికి న‌డిపించాయ‌ని చెప్పారు. జీవితంలో త‌న పిల్ల‌ల‌కు పాఠాలు నేర్పిచ‌డానికి ప‌నికి వ‌చ్చాయ‌ని అన్నారు.

ALSO READ: సినిమాలో రవితేజకి ప్రేయసిగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading