Home » 23న విజ‌యవాడలో ఆచార్య ప్రీ రిలీజ్‌.. చీఫ్ గెస్ట్ ఎవ‌రంటే..?

23న విజ‌యవాడలో ఆచార్య ప్రీ రిలీజ్‌.. చీఫ్ గెస్ట్ ఎవ‌రంటే..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 23న విజ‌య‌వాడ‌లో అంగరంగ వైభ‌వంగా జ‌రుగ‌నున్న‌ది. ఈ వేడుక‌లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటార‌ని స‌మాచారం. మ‌రొక‌వైపు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి సీఎంను క‌లుసుకునే అవ‌కాశ‌ముంద‌ని.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చీప్ గెస్ట్ అని కూడా తెలుస్తోంది.


ఆచార్య చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికీ జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. తొలిసారి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి పూర్తిస్థాయిలో న‌టిస్తొన్న చిత్రంగా ఆచార్య అభిమానుల‌లో ఆనందం పెంచుతోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సైతం విజ‌య‌తీరాల‌ను చేరుకుంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. గ‌తంలో చిరంజీవికి అనేక మ్యూజిక‌ల్ హిట్స్ అందించిన మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు కూడా బాణీలు క‌ట్ట‌డం.. ఆ పాట‌లు అల‌రిస్తుండ‌డంతో సినిమాపై బ‌జ్ రోజు రోజుకు పెరుగుతోంది.

Advertisement

Advertisement

ఈ నేప‌థ్యంలో సాగ‌నున్న ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల్లో మ‌రింత ఉత్సాహం పెంచ‌నున్న‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్దే, సోనూసూద్, జిష్పూ సేన్‌గుప్త‌, వెన్నెల కిశోర్‌, సౌర‌వ్ లోకేశ్‌, కిశోర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్‌, సంగీత‌, రెజీనా, నాజ‌ర్ న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న జ‌నం ముందుకు రానున్న‌ది.

ఇవి కూడా చదవండి :

  1. రాంచరణ్ గదిలోకి వచ్చిన కోతి.. ఆయన ఏం చేశారంటే..!!
  2. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి పై బండ్ల గణేష్ ఫైర్….నువ్వు ఆంధ్రాకు పట్టిన దరిద్రం అంటూ ఘాటు వ్యాఖ్యలు …!
  3. అందాలతో అలరిస్తున్న సమంత.. చూస్తే చమటలు పట్టాల్సిందే..!!
Visitors Are Also Reading