Home » ఆచార్యకు అదే హైలెట్ సీన్.. సినిమాను నిలబెట్టేది ఇదేనట..!

ఆచార్యకు అదే హైలెట్ సీన్.. సినిమాను నిలబెట్టేది ఇదేనట..!

by Anji
Ad

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలన్నింటిని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఆ విధంగా విడుదల చేసిన సినిమాలు కూడా అదే విధంగా హిట్ అవుతున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరొక విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల హీరోలు మెగా ఫ్యామిలీ హీరోలు కావడం విశేషం. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య కూడా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల‌వ్వ‌నుంది.


ఆచార్య సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆచార్య దర్శకుడు హరీష్ శంకర్ తో జరిపిన చిట్‌చాట్‌తో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని హైలెట్స్ సీన్ గురించి మాట్లాడారు. చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఓ సన్నివేశం షూట్ చేశారట. ఆ సమయంలో శీను ఎలా వచ్చింది అనే విషయం ఎవరూ చెప్పట్లేదు అంట. ఓకేనా లేక మరొకటి తీసుకోవాలో తెలియక చాలా టెన్షన్ పడ్డాను. లంచ్ బ్రేక్ అని చెప్పినా ఎవరూ కదలడం లేదు. మేమే సమయం తీసుకుని ఎవరూ కలవడం లేదు ఏంది ఆ సీన్ చూసి అంటూ కొరటాల గారికి చెప్పాము. అప్పుడు మానిటర్ లో ఆ సీను చూసిన అందరూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడినుంచి కదిలారు. రామ్ చరణ్ ఆ సీన్లో గుండెల్ని పిండేసే విధంగా నటించాడు.

Advertisement

Advertisement

ఇక ఈ సినిమాకు సోలు ఆ సీన్ క్లైమాక్స్ కు లేడు అదే సినిమాను నిలబెడుతుంది అంటూ కీలకమైన విషయాన్ని వెల్లడించారు చిరంజీవి. ఈ చిత్రంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ బిగ్గెస్ట్ హైలెట్ కానున్నట్లు సమాచారం. చిరంజీవితో రైతు సీతో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రి కొడుకుల యాక్షన్ సన్నివేశాలు, అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం 29 వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read : 

160 భాష‌ల్లో అవ‌తార్‌-2.. విడుద‌ల ఎప్పుడంటే..?

పెళ్లి చేసుకునేటప్పుడు స్త్రీపురుషుల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే మంచిదో తెలుసా..!

Visitors Are Also Reading