Home » మ‌ధ్య‌లోనే ఆగిపోయిన రాజ‌మౌళి సినిమా ఏదో తెలుసా…హీరో ఎవ‌రంటే..!

మ‌ధ్య‌లోనే ఆగిపోయిన రాజ‌మౌళి సినిమా ఏదో తెలుసా…హీరో ఎవ‌రంటే..!

by AJAY
Ad

అప్ప‌ట్లో కేవ‌లం హీరోల‌ను చూసే సినిమాలకు వెళ్లే వాళ్లు. అంటే క్రేజ్ పూర్తిగా హీరోల‌కు మాత్ర‌మే ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ద‌ర్శ‌కులను చూసి సినిమాల‌కు వెళుతున్నారు.హీరోను చూసి సినిమాకు కేవ‌లం అభిమానులు మాత్ర‌మే వెళ‌తారు. కానీ ద‌ర్శ‌కుడు రెండు మూడు హిట్లు కొట్టాడంటే చాలు ప్రేక్ష‌కులు మూడో సినిమాకు క్యూ క‌డ‌తారు. ఇక అలాంటి క్రేజ్ ఉన్న ద‌ర్శ‌కుడే రాజ‌మౌళి. ప్ర‌స్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా రాజ‌మౌళి అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

Advertisement

తీసిన ప్ర‌తి సినిమాకు హిట్ టాక్ రావ‌డమే కాకుండా థియేట‌ర్ల‌లో వేల కోట్ల క‌లెక్ష‌న్ ల‌ను రాబ‌డుతున్నాయి. మ‌గ‌ధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ రాజ‌మౌళి పేరు మారుమోగిపోయింది. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ లు శంక‌ర్ తో పాటూ మ‌రికొంద‌రిని జ‌క్క‌న్న వెన‌క్కి నెట్టేశారు. ఇక బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి బాలీవుడ్ ను సైతం త‌న‌వైపు తిప్పుకున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లు కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచాయి.

Also Read: ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో క‌ల‌క‌లం..వీడియోలు వైర‌ల్…!

Advertisement

Rajamouli

Rajamouli

వేల‌కోట్ల‌ను రాబ‌ట్టాయి…..ఈ చిత్రం త‌ర‌వాత బాహుబ‌లిలో న‌టించిన ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ఈనెల 25న విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. అయితే ఇప్పుడు రాజ‌మౌళి సినిమా షురూ చేశారంటే ఆగే ప్ర‌సక్తే లేదు కానీ కెరీర్ ప్రారంభంలో జ‌క్క‌న్న మొద‌లెట్టిన ఓ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా తీసిన త‌ర‌వాత జ‌క్క‌న్న మోహ‌న్ లాల్ హీరోగా ఓ మైథ‌లాజిక‌ల్ డ్రామా తీయాల‌నుకున్నాడు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు సూర్య‌ప్ర‌కాష్ తో భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. కానీ భారీ బ‌డ్జెట్ కారణంగా ఆ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అంతేకాకుండా సూర్య‌ప్ర‌కాష్ న‌టించిన మొద‌టి సినిమా నీతో అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డం కూడా ఇందుకు ఓ కార‌ణం.

Also Read: ఆల‌స్యంగా పెళ్లి చేసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు…తెలిస్తే ఒప్పుకోవాల్సిందే…!

Visitors Are Also Reading