Home » “అంత ఇష్టం ఏంద‌య్యా” పాట‌ను ఎందుకు తొల‌గించారో తెలుసా..?

“అంత ఇష్టం ఏంద‌య్యా” పాట‌ను ఎందుకు తొల‌గించారో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో సంగీత ద‌ర్శ‌కుడు త‌మన్ హ‌వా క‌నిపిస్తోంది. వరుస సినిమాల‌తో త‌మ‌న్ దూసుకుపోతున్నారు. ఇటీవ‌లే త‌మ‌న్ అఖండ సినిమాతో మ్యూజిక‌ల్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలోని అన్ని పాట‌లు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. అంతే కాకుండా ఈ సినిమాకు త‌మ‌న్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంది. సినిమాకే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

ఇదిలా ఉండ‌గానే త‌మ‌న్ అకండ హిట్ త‌ర‌వాత మ‌రో మ్యూజిక‌ల్ హిట్ అందుకున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమాకు కూడా త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని పాట‌లు కూడా అన్నీ సూప‌ర్ హిట్ గా నిలిచాయి. అదే విధంగా భీమ్లానాయ‌క్ సినిమాకు కూడా త‌మ‌న్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దాంతో త‌మ‌న్ మ్యూజిక్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

Advertisement

Also Read: సాయి పల్లవి ‘భీమ్లా నాయక్’ ని ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా ?

అయితే ఈ సినిమాలోని ఓ సూప‌ర్ హిట్ పాట‌ను తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. అంత ఇష్టం ఏంద‌య్యా…..అనే పాటను ముందే విడుద‌ల చేశారు. కానీ ఈ సినిమాలో మాత్రం అంత ఇష్టం ఏంద‌య్యా పాట క‌నిపించ‌లేదు. అయితే ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ ను కూడా షేక్ చేస్తోంది. ఇంటి హిట్ గా నిలిచిన పాట‌ను సినిమా నుండి ఎందుకు తొల‌గించార‌ని అంతా అనుకున్నారు.

ALSO READ : అమ్మ రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన 6 సినిమాలు- వాటి రిజ‌ల్ట్స్!

కాగా అదే డౌట్ ఓ మీడియా ప్ర‌తినిధికి కూడా వ‌చ్చిన‌ట్టు ఉంది. దాంతో పాట‌ను ఎందుకు తొలగించారు అంటూ ప్ర‌శ్నించారు. దానికి త‌మ‌న్ మండుతున్న స్టౌవ్ పై నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది అంటూ త‌మ‌న్ ఎదురు ప్ర‌శ్న వేశారు. త‌మ‌న్ స‌మాధానం చూస్తే సినిమా మాస్ యాక్ష‌న్ తో కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఆ పాట క‌రెక్ట్ కాక‌పోవ‌డంతో తొల‌గించిన‌ట్టు క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading