Home » గుర్తు పట్టలేనంత మారిపోయిన ఆది సినిమా హీరోయిన్…ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

గుర్తు పట్టలేనంత మారిపోయిన ఆది సినిమా హీరోయిన్…ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by AJAY
Ad

నిన్న మొన్నటి వరకూ సినిమాల్లో మెరిసిన హీరోయిన్ లు సినిమాలకు దూరం అవ్వగానే గుర్తు పట్టలేనంత గా మారిపోతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్ లు పెళ్లి చేసుకుంటే మరికొందరు సింగిల్ గానే ఉండిపోయారు. ఇప్పుడు అలాంటి ఓ హీరోయిన్ గురించి తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ఆది. ఈ సినిమా 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా మాస్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తో ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్ కీర్తి చావ్లా నటించింది.

 

Advertisement

ఈ సినిమా తర్వాత కీర్తి చావ్లా కు తెలుగులో మరికొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాలు అనుకున్నమేర విజయం సాధించలేదు. అంతే కాకుండా తెలుగు తో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. చివరగా ఈ ముద్దుగుమ్మ 2016 లో నమిత ముఖ్యమైన పాత్రలో నటించిన ఇళమై ఊంజల్ అనే తమిళ సినిమాలో నటించింది.

ఇక ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించలేదు. అయితే సినిమా లకు దూరం అయినా కూడా కీర్తి చావ్లా పెళ్లి కూడా చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయింది. అయితే కీర్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవ్వడం తో ఇంతలా మారిపోయిందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Also read : వెంకటేష్ కోసం రిజిస్ట్రేషన్ చేసిన టైటిల్ చిరంజీవికి ఎలా వచ్చిందో తెలుసా ?

Visitors Are Also Reading