Home » ఒక్క 500నోటు కుటుంబాన్ని నాశనం చేసింది.. ఎంత అమానుషమంటే..?

ఒక్క 500నోటు కుటుంబాన్ని నాశనం చేసింది.. ఎంత అమానుషమంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం బంధాలు బంధుత్వాలన్నీ చాలా దారుణంగా తయారవుతున్నాయి. బంధుత్వాలను మరిచి పరిధి దాటి రకరకాల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల ఎంతోమంది వారి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఈ బంధాలు బంధుత్వాలు కూడా డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. చివరికి ఆ డబ్బే ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకొస్తోంది.. అలా 500 రూపాయల నోటు ఆ కుటుంబాన్ని నాశనం చేసింది ఒకరి ప్రాణాలు తీసింది.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మధుగిరి తాలూకాలోని ముద్దనరలకేరా గ్రామానికి చెందినటువంటి రామాంజినప్ప కాంతమ్మ భార్యాభర్తలు..

also read:‘కబ్జా’ సినిమాపై నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు!

Advertisement

Advertisement

రామాంజి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తారు. అయితే వీరిద్దరికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో నిత్యం వేధిస్తూ ఉండేవారు రామాంజినప్ప. ఒకరోజు రామాంజినప్ప తన పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. తన భార్య కాంతమ్మ దగ్గర 500 రూపాయలు ఉండడం గమనించాడు. ఈ డబ్బు నీకు ఎక్కడిదని ప్రశ్నించాడు.. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి తారాస్థాయికి చేరింది . రామాంజినప్ప అక్కడి నుంచి వెళ్లిపోయి. అర్ధరాత్రి తన భార్య, ముగ్గురు కూతుళ్లు గాడ నిద్రలో ఉండగా అందరిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

also read:Kabzaa Review Telugu : కబ్జా మూవీ రివ్యూ..మొత్తం KGF ను దించేశాడా ?

అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అలా మంటల్లో నలుగురు కాలుతూ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే కాంతమ్మ ప్రాణాలు పోయాయి. ఇక మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు రామాంజినప్పను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మరి ఈ ఘటనపై మీ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి..

also read:రేణుకకి డబ్బు ఆశ.. ప్రవీణ్ కి అమ్మాయిల కోరిక.. కీలక అంశాలు వెలుగులోకి !

Visitors Are Also Reading