Home » హీరోయిన్ స‌మంత‌కు అరుదైన గౌర‌వం.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సామ్‌..!

హీరోయిన్ స‌మంత‌కు అరుదైన గౌర‌వం.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సామ్‌..!

by Anji

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర హీరోయిన్ లలో సమంత ఒకరు. ఇటీవలే సామ్ నాగ చైతన్య తో విడాకులు ప్రకటించినప్పటి నుంచి వరుస సినిమాలతో బిజీగా దూసుకెళుతోంది. ఇక ఈ స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన ఆహ్వానమే అందింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ సినిమా ఫెస్టివల్ కు ముఖ్యఅతిథిగా వెళ్లేందుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. కరోనా సంక్షోభంతో రెండేళ్ల పాటు వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ఆగస్టు 12 నుంచి మెల్‌బోర్న్‌లో ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగనున్నాయి.


ఈ సందర్భంగా తనకు ఇన్విటేషన్ రావడం పట్ల సమంత సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐఎఫ్ఎఫ్ఎమ్ లో భాగమయ్యాను. ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఇందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారతీయ సినిమాలను, భారతీయులు, సినీ ప్రేమికులు, ఇతరులందరినీ ఇలా ఒక చోటుకు చేర్చడం అనేది ఒక గొప్ప అనుభూతిస‌. అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సామ్.

అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయినట్టు ప్రకటించిన తరువాత ఇక సామ్ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ అయితే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఈ అమ్మడు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం శకుంతలం, యశోద అనే రెండు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు, విజయ్ దేవరకొండ తో జంటగా ‘ఖుషి’ లో నటిస్తున్నారు. విడాకులు తీసుకున్న తరువాత నే సమంత వరుస దూసుకెళుతున్నారు.

Also Read : 

ఉద‌య్ కిర‌ణ్ లాంటి స్థితే ప్ర‌భాస్ కు కూడా…రెబ‌ల్ స్టార్ జాత‌కం పై వేణుస్వామి స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

జీవితంలో సౌంద‌ర్య చేసిన అతిపెద్ద త‌ప్పు ఏంటోతెలుసా.? త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌న్నా విన‌కుండా..!

 

Visitors Are Also Reading