Home » షూటింగ్ లో నిద్రపోయిన జగ్గయ్యను సావిత్రి ఎంత ఏడిపించేవారో తెలుసా..?

షూటింగ్ లో నిద్రపోయిన జగ్గయ్యను సావిత్రి ఎంత ఏడిపించేవారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి నటుల్లో హీరోయిన్ సావిత్రి నటనకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె ఎన్ని గంభీరమైన పాత్రలు చేసినా కానీ నిజ జీవితంలో మాత్రం చాలా అల్లరి చేసే పిల్ల. షూటింగ్ లొకేషన్లో అయితే ఆమె అల్లరి భరించడం చాలా కష్టమని చెప్పవచ్చు. కానీ ఒక్కసారి షార్ట్ రెడీ అంటే మాత్రం ఆమెలోని నట విశ్వరూపం చూపించేది. లొకేషన్ లో సావిత్రి ఉందంటే చాలు అక్కడ పండగ వాతావరణం ఉండేది. ఈ విధంగా అందరినీ ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ కడుపుబ్బ నవ్వేలా జోకులు వేస్తూ ఉంటుంది. అలా ఉండటం వల్లే కావచ్చు ఆమె జీవితమంతా విషాదంలో మునిగిపోయింది. కట్ చేస్తే.. నటుడు జగ్గయ్య తన సొంత నిర్మాణ సంస్థలో ఎన్నో సినిమాలు తీశారు.

Advertisement

also read:సినీ ఇండస్ట్రీకి రాకముందు రిషబ్ శెట్టి ఇన్ని కష్టాలు పడ్డాడా ?

Advertisement

బయట వారి సినిమా అంటే టైంకి మేకప్ తో పాటు ఉండే జగ్గయ్య , ఆయన సొంత సినిమా విషయానికి వచ్చేసరికి లొకేషన్ కి వచ్చి నిద్రపోయేవారు. జగ్గయ్య మరియు విజయనిర్మల హీరో హీరోయిన్లుగా వచ్చిన ఓ సినిమాలో సావిత్రి ముఖ్యమైన పాత్రలో నటించింది. ఒకరోజు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జగ్గయ్య హాయిగా వెళ్లి పడుకున్నారట. కానీ ఆ రోజే ముఖ్యమైన సీన్స్ షూట్ చేయాలి. కానీ ప్రొడ్యూసర్ అయిన జగ్గయ్యను లేపే ధైర్యం అక్కడ ఎవరికి లేదు. షూటింగ్ సమయం అవుతుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే సావిత్రి రంగ ప్రవేశం చేసి జగ్గయ్యను నిద్రలేపడానికి ఒక చిన్న పుల్ల పట్టుకుని వెళ్ళింది.

ఆ పుల్లతో ఆయన చెవిలో తిప్పి ఆయనకు మెలకువ వచ్చే లోపు అక్కడి నుంచి మాయమైంది. ఎవరు నిద్ర లేపారో కూడా జగ్గయ్య చూడలేదు. ఆయన కోపంగా నిద్ర లేవడం చూసి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇక చివరికి జగ్గయ్య మేకప్ రూమ్ కి వెళ్ళిపోయి, సీన్ కి రెడీ అయి వచ్చారు. ఆ విధంగా ఆ రోజుల్లో సావిత్రి అందరినీ ఆట పట్టించేలా ఉండేదట.

also read:

Visitors Are Also Reading