Home » బ్రతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లి..30 కోట్ల లాటరీ కొట్టిన తెలుగోడు..!!

బ్రతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లి..30 కోట్ల లాటరీ కొట్టిన తెలుగోడు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ రంగం లో రాణించాలన్నా, జీవితంలో సెట్ కావాలన్నా కష్టంతో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.అలా ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు.అయితే ఒక్కోసారి కొంతమందిని అదృష్ట లక్ష్మి తలుపు తడుతూ ఉంటుంది.. ఒక్కసారిగా వారి జీవితాలనే మార్చేస్తుంది. అలాంటి అదృష్ట లక్ష్మి బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన వ్యక్తి జీవితాన్ని మార్చింది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read:Kaikala satyanarayana: కైకాల యమదొంగ మూవీ వదులుకోవడానికి కారణం..!!

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందినటువంటి ఓగుల అజయ్ అనే డ్రైవర్ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ఆయన దుబాయిలో కొన్న లాటరీ ఏకంగా 30 కోట్ల జాక్ పాట్ కొట్టింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన అజయ్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి అన్నీ తానై పెంచింది. ఉపాధి కోసం ఆ యువకుడు దుబాయి వెళ్లాడు. అక్కడ ఒక జువెలరీ షాప్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Advertisement

ఈ సందర్భంలోనే కొంత డబ్బు పెట్టి అక్కడ లక్కీ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. ఇంతలోనే తనకున్న టికెట్లలో ఒకటి 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. దీంతో అజయ్ ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు.దీంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. బ్రతుకుతెరువు కోసమని దుబాయి వెళ్తే అదృష్ట దేవత తలుపు తట్టిందని ఆయన అంటున్నాడు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

also read:

Visitors Are Also Reading