Home » మూడో హీరోయిన్ కూడా టిల్లు గానికి నో చెప్పింద‌ట‌..4వ ఆప్ష‌న్ ఎవ‌రంటే..?

మూడో హీరోయిన్ కూడా టిల్లు గానికి నో చెప్పింద‌ట‌..4వ ఆప్ష‌న్ ఎవ‌రంటే..?

by AJAY
Ad

సాధార‌ణంగా ఒక సినిమాలో ఒక‌రు లేదా ఇద్ద‌రు హీరోయిన్లు నో చెప్ప‌డం కామ‌న్. కానీ ఒక సినిమాకు ముగ్గురు హీరోయిన్ లు నో చెప్ప‌డం టాలీవుడ్ లో అస‌లు జ‌ర‌గ‌లేదేమో. కానీ డిజే టిల్లుకు మాత్రం న‌లుగురు హీరోయిన్ లు గుడ్ చెప్పిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి న‌టించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ఈ సినిమా యూత్ కు తెగ న‌చ్చేసింది. అయితే ఈ సినిమా పార్ట్ 2 నుండి మాత్రం హీరోయిన్ ను తప్పించారు.

Advertisement

అంతే కాకుండా ద‌ర్శ‌కుడు సైతం సీక్వెక్ ను నో చెప్పాడు. మొద‌ట ఓకే చెప్పిన‌ప్ప‌టికీ సిద్దు క‌థ‌లో వేలు పెట్ట‌డం వ‌ల్ల ద‌ర్శ‌కుడు త‌ప్పుకున్నాడు అనే టాక్ ఉంది. ఇక సీక్వెల్ విష‌యానికి వ‌స్తే మొద‌ట సినిమాలో హీరోయ‌న్ గా శ్రీలీల న‌టిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ కొద్దిరోజుల షూటింగ్ త‌ర‌వాత శ్రీలీల ఈ సినిమా నుండి త‌ప్పుకుంది. ఆ త‌ర‌వాత‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ న‌టిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే కొన్నిరోజుల షూట్ త‌ర‌వాత సిద్దు వ‌ల్ల‌నే అనుప‌మ కూడా సినిమా నుండి త‌ప్పుకుంది అనే టాక్ వినిపించింది.

Advertisement

Dj tillu

Dj tillu

ఆ ఇద్ద‌రు హీరోయిన్ లు గుడ్ బై చెప్పిన త‌ర‌వాత ఈ సినిమాలో మ‌డోనా సెబాస్టియ‌న్ ను హీరోయిన్ గా తీసుకున్నార‌ని టాక్ వినిపించింది. కానీ ఇంత‌లోనే మ‌డోనా కూడా సినిమాకు గుడ్ బై చెప్పిందంటూ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా నాలుగో హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశార‌ని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా అడ‌విశేషు హీరోగా న‌టించిన హిట్ 2 సినిమాలో హీరోయిన్ గా న‌టించిన మీనాక్షి చౌద‌రిని తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి మీనాక్షి అయినా సిద్దుగాడితో వేగుతుందా లేదా అన్న‌ది చూడాలి.

Visitors Are Also Reading