సాధారణంగా ప్రతి సినిమాకు ఐఎండీబీ రేటింగ్ ఉంటుంది. సినిమాను బట్టి ఐఎండీబీ రేటింగ్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ ఏడాది ఐఎంబిడి రేటింగ్ ప్రకారం దేశంలో టాప్ 10 స్థానాల్లో నిలిచిన సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. ఆ పది సినిమాలు ఏవి ఏ సినిమాకు ఎంత రేటింగ్ వచ్చింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం…..
కన్నడ సినిమా ఛార్లీ ఐఎండీబీ రేటింగ్ లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు 8.9 రేటింగ్ వచ్చింది. అంతేకాకుండా తమిళ సినిమా రాకెట్ట్రీ 8.8 రేటింగ్ తో రెండో స్థానంలో నిలిచింది.
Advertisement
ఈ సినిమా తర్వాత స్థానంలో రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన కన్నడ సినిమా కాంతార నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
అంతే కాకుండా తెలుగు సినిమా సీతారామం సైతం 8.6 రేటింగ్ సొంతం చేసుసుకుని నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
Advertisement
తమిళ సినిమా విక్రమ్ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాకు 8.4 రేటింగ్ వచ్చింది.
అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 సైతం ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 8.4 రేటింగ్ తో ఐఎండీబీ రేటింగ్ లో టాప్ 10 లో నిలిచింది.
ఆ తర్వాత బాలీవుడ్ సినిమా కాశ్మీర్ ఫైల్స్ 8.3 రేటింగ్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆ తర్వాత స్థానంలో టాలీవుడ్ సినిమా మేజర్ నిలిచింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన సంగతి తెలిసిందే.
అయితే పాన్ ఇండియా లెవల్ లో విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ కు మాత్రం షాక్ తగిలింది. వేల కోట్ల వసూళ్ల రాబట్టినప్పటికీ ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ చూస్తే కేవలం 8 గా ఉంది. ఇక ఆ తర్వాత తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ నిలిచింది. ఈ సినిమాకు 7.9 రేటింగ్ వచ్చింది.
ALSO READ : పిల్లలు భూతులు మాట్లాడటానికి 5 కారణాలు..మాట్లాడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!