Home » 2022లో ఈ లోకాన్ని విడిచిన 10 మంది సెల‌బ్రెటీలు వీళ్లే..!

2022లో ఈ లోకాన్ని విడిచిన 10 మంది సెల‌బ్రెటీలు వీళ్లే..!

by AJAY

సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో మరణించడం టాలీవుడ్ లో గ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో తీవ్ర‌విషాదాన్ని నింపింది. అంతేకాకుండా ఈ ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీలో ముగ్గురు మరణించారు.

Also Read: హైదరాబాద్‌కు చెందిన సోహ్రాబ్ మీర్జాతో సానియా మీర్జా నిశ్చితార్థం జరిగిన విషయం మీకు తెలుసా ?

 

ఏడాది ప్రారంభంలో జ‌న‌వ‌రిలో రమేష్ బాబు అనారోగ్యంతో మరణించిన సంగ‌తి తెలిసిందే. ఇక గత నెల కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూశారు. ఘట్టమనేని ఫ్యామిలీలో ముగ్గురు మరణించడమే కాకుండా ఈ ఏడాది వ‌రుస విషాద వార్త‌ల‌ను తెలుగువారు వినాల్సివ‌చ్చింది. సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న క‌లిగించింది. అలా ఈ ఏడాది క‌న్నుమూసిన సెల‌బ్రెటీలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…

ప్రభాస్ పెదనాన్న హీరో కృష్ణంరాజు సెప్టెంబర్ లో అనారోగ్యంతో కన్నుమూశారు.

ప్రముఖ యూట్యూబర్ గాయత్రి హైదరాబాద్ లో హోలీ సందర్భంగా ఓ ఈవెంట్ కు వెళ్లివ‌స్తుండ‌గా కారు ప్రమాదంలో మరణించారు.

Also Read:   కృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

అంతే కాకుండా టాలీవుడ్ సీనియర్ నటుడు మన్న‌వ‌ బాలయ్య సైతం ఇదే ఏడాది మరణించారు. ఆయన వంద‌ల‌ చిత్రాలలో నటించి ఎంతో గుర్తింపు సాధించారు. అంతేకాకుండా ఈ ఏడాది నందమూరి ఫ్యామిలీ లోనూ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

ఎన్టీ రామారావు కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త నందమూరి అభిమానులను మరియు నందమూరి కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టివేసింది. అదే విదంగా మహర్షి సినిమాలో గురుస్వామి ముఖ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. మహర్షి తాతగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఇక ఆయన సైతం ఇదే ఏడాది కన్నుమూశారు. మ‌రోవైపు మలయాళ సినీ నటుడు మరియు జర్నలిస్ట్ డీఎంకే మురళి సైతం ఆకస్మిక మరణం చెందారు. ఆయన ఎన్నో మలయాళ చిత్రాల్లో నటించారు. ఎక్కువగా పోలీస్ పాత్రలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు.

అంతే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త…. ఆంధ్రప్రదేశ్ ఎంపీ మేకపాటి గౌతంరెడ్డి సైతం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణం వైసిపి కార్యకర్తల్లో మ‌రియు పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ALSO READ :  హైదరాబాద్‌కు చెందిన సోహ్రాబ్ మీర్జాతో సానియా మీర్జా నిశ్చితార్థం జరిగిన విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading