Home » సినిమాకే హైలెట్ నిలిచిన ఈ 10 పాత్రలను రిజెక్ట్ చేసిన నటీనటులు ఎవరో తెలుసా….?

సినిమాకే హైలెట్ నిలిచిన ఈ 10 పాత్రలను రిజెక్ట్ చేసిన నటీనటులు ఎవరో తెలుసా….?

by AJAY
Ad

సినిమాలలో కొన్ని ముఖ్యమైన పాత్రలకు దర్శకులు ముందుగా ఒకరిని అనుకుంటారు. కానీ ఆ పాత్రను వాళ్ళు రిజల్ట్ చేయడంతో మరొకరితో నెట్టుకు వస్తారు. కానీ ఆ పాత్రలు సినిమాకి హైలెట్ గా నిలిచి నటించిన వారికి మంచి పేరు వస్తుంది. అలా మంచి పాత్రలను రిజెక్ట్ చేసిన నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

రంగస్థలం సినిమా లో అనసూయ రంగమ్మత్త పాత్రలో నటించింది. ఈ పాత్ర కోసం సుకుమార్ రాశిని సంప్రదించారట కానీ రాశి ఈ పాత్రకు నో చెప్పిందట.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కు ఎంతో గుర్తింపు లభించింది. ఈ పాత్ర కోసం మొదట రజనీకాంత్ ను సంప్రదించారట. కానీ ఆయన నో చెప్పడంతో ప్రకాష్ రాజ్ నటించారు.

జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కు పెదనాన్న పాత్రలో మొదట బాలకృష్ణను అనుకున్నారట. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో మోహన్ లాల్ నటించారు.

ఆగడు సినిమాలో సోనూసూద్ నటించిన పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్ ను అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు.

 

Advertisement

నాన్నకు ప్రేమతో సినిమా లో జగపతి బాబు చేసిన రోల్ కోసం ముందుగా అరవింద్ స్వామిని అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు.

గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ పాత్ర కోసం తమిళ నటుడు రాజ్ కిరణ్ ను సంపాదించారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు.

అరవింద సమేత సినిమాలో జగపతిబాబు భార్య పాత్రలో నటించేందుకు హీరోయిన్ లయను సంప్రదించారు ఆమె రిజెక్ట్ చేసింది.

 

బాలీవుడ్ సినిమా పద్మావతి లో మొదటగా ప్రభాస్ ను అనుకున్నారు. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో షాహిద్ కపూర్ నటించాడు.

రంగస్థలం సినిమా లో ప్రెసిడెంట్ పాత్ర కోసం రాజశేఖర్ ను అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో జగపతి బాబు నటించారు.

బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం మొదటగా శ్రీదేవిని సంపాదించారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించారు.

 

Also read : ఈ ఫోటీలో ఒక చిరుతపులి దాక్కుని ఉంది దాన్ని కనిపెట్టగలరా ? తెలివైన వారికి మాత్రమే !

Visitors Are Also Reading